కథానాయకుడు అల్లుఅర్జున్ ఈ రోజు తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు వెళ్లారు. తన భార్య స్నేహారెడ్డి తండ్రి, తనకు మామ అయిన బీఆర్ ఎస్నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన ఫంక్షన్హాల్ను ఆయన నేడు ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి భట్టుగూడెం వద్ద కంచర్లకన్వెషన్ పేరుతో ఫంక్షన్హాల్ను నిర్మించారు. చంద్రశేఖర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి బీఆర్ ఎస్ టికెట్ను ఆశిస్తున్నారు. అందుకే ఆయన గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్తో ఈ ప్రారంభోత్సవం కార్య్రకమం నిర్వహించడం, దీంతో తన పలుకుబడిని, తన అల్లుడు క్రేజ్ను అధిష్టానంకు చూపించి టికెట్ పొందవచ్చని ఆయన ఆశిస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం ఈ రోజు అక్కడ జిల్లా నలుమూలాల నుంచి భారీఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకున్నారు.
2014 ఎన్నికల్లో నే చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 24 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ తరువాత టీఆర్ ఎస్లో చేరడంతో చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ పక్కన పెట్టింది.దీంతో ఆయన తన స్వస్థలమైన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని ఆ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టాడు. నియోజకవర్గం వారిగా పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నాడు.
తాజాగా ఆధునిక వసతులతో 1000 మందికి సరిపోయే ఫంక్షన్హాల్ను నిర్మించారు. సమీప గ్రామాల ప్రజలకు తక్కువ ధరలకే ఇది అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాన్ని తన అల్లుడు పాపులారిటీతో ఘనంగా నిర్వహించి తన సత్తా చాటి, బీఆర్ ఎస్ టికెట్ను పొందాలని ఆశిస్తున్నాడు చంద్రశేఖర్ రెడ్డి. సో.. మామ ఎమ్మేల్యే సీటు కోసం అల్లుడు అల్లుఅర్జున్ తన వంతు సహాయం చేస్తున్నాడు అన్నమాట.