Ram Charan and Shankar:’ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏం సినిమా చేస్తాడా? అని ఎదురు చూస్తున్న మెగాభిమానులకు కనీవినీ ఎరుగని సర్ప్రైజ్ ఇచ్చాడు రామ్ చరణ్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్తో తన తదుపరి చిత్రం ఉంటుందని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా.. జెంటిల్మేన్, ప్రేమికుడు, ఇండియన్, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, 2.0 వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చిత్రాన్ని సెట్ చేసింది ఎవరో తెలుసా? సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ ప్రెస్టీజియస్ మూవీ భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందనుంది.
ఈ ప్రకటన అనంతరం నిర్మాతలు దిల్రాజు, శిరీష్ మాట్లాడుతూ.. ”సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలవుతుంది. ఈ జర్నీలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి స్టార్ హీరోలతో, అప్ కమింగ్, డెబ్యూ హీరోలతో, దర్శకులతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయే చిత్రాలను రూపొందించాం. ఇప్పుడు మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకమైన 50వ సినిమాను మెగా పవర్స్టార్ రామ్చరణ్గారితో నిర్మిస్తున్నాం. ఆయన హీరోగా నటిస్తున్న 15వ చిత్రమిది.
దక్షిణాది సినిమా స్థాయిని ఇటు సబ్జెక్ట్ పరంగా, అటు సాంకేతికంగా నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లిన భారీ చిత్రాల సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాను మా బ్యానర్లో నిర్మించనున్నాం. చరణ్, శంకర్ వంటి క్రేజీ కాంబినేషన్లో ప్యాన్ ఇండియా మూవీ అంటే.. సినిమాపై ఎలాంటి భారీ అంచనాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. సినీ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ ప్యాన్ ఇండియా మూవీని రూపొందిస్తాం. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కూడా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్ప్రైజెస్,…
నేషనల్, అక్టోబర్xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో…
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…
యష్రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…