Cinema

సౌందర్య గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన ఆమని

‘ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు… పక్కింటి పిన్నిగారి కాసులపేరు చూడు’ అంటూ భర్తని డబ్బులు కోసం వేధించే సగటు ఇల్లాలిగా అందరిని ఆకట్టుకున్న నటి ఆమని. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో తన పాత్ర మేర ఒదిగిపోయి తన అందం అభినయంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమని ముఖ వర్చస్సు కానీ, శరీర ఆకృతిలో కానీ ఎటువంటి మార్పులు లేకుండా.. హీరోయిన్స్‌కి ధీటుగా ఆమె బ్యూటీని మెయింటైన్‌ చేస్తుంది. అమ్మ పాత్రలతో సినీ అభిమానుల్ని అలరిస్తూనే ఉంది. శుభలగ్నం, మావిచిగురు, సిసింద్రీ, ఆ నలుగురు, భరత్‌ అనే నేను వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును ఇచ్చాయి. తాజాగా ఆమె అప్పుడు సిసింద్రీ సినిమాలో తల్లిగా నటించిన అఖిల్‌కి.. మరోసారి మదర్‌ కాబోతోంది. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చిత్రంలో అఖిల్‌కి మదర్‌గా ఆమని నటిస్తోంది. అలాగే యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో కార్తికేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో కూడా ఆమె హీరో మదర్‌గా నటించింది. మార్చి 19న ‘చావు కబురు చల్లగా’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూలలో తన స్నేహితురాలు, ప్రముఖ నటి సౌందర్య గురించి కూడా ఎన్నో విషయాలు తెలిపింది.

ఆమని.. సౌందర్య గురించి చెప్పని సంభాషణ యథాతథంగా మీకోసం:

యాంకర్: మీరు, సౌందర్య గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాము. ఏదైనా ఆమెతోనే పంచుకునే వారట. నిజమేనా.

ఆమని: అవును.. బయట సౌందర్యకి ఎంత మంది స్నేహితులైన ఉండనివ్వండి.. నాకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య. మేము కలిస్తే మాత్రం అన్ని నాతోనే చెప్పుకునేది. నేను కూడా తనతోనే చెప్పుకునేదాన్ని. తనకి పెళ్లి అయిన తరువాత కూడా తనతో మాట్లాడుతుండేదాన్ని. ఎక్కడైన తన మూవీ షూటింగ్ జరుగుతున్నా నన్ను రమ్మని అడిగేది. కానీ నేను బాగుండదేమో రానే అనేదాన్ని. పర్లేదు ఇది నా మూవీనే రా అని అడిగేది. నాకు చాలా బోర్ గా ఉందే అనేది. ఎప్పుడైనా ఏదైనా సినిమా షూటింగ్ కోసం నేను బెంగళూర్ వెళ్లినా మా ఇల్లు పక్కనే ఉంది రా ఒకసారి అని పిలిచేది. కానీ నాకే టైం లేక వెళ్ళలేకపోయాను.

యాంకర్: సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండడం వేరు. బయట కూడా ఫ్రెండ్స్ గా ఉండడం వేరు. అలాంటిది తాను ఇక లేదు అని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీలైయ్యారు.

ఆమని: ముందు నేనసలు నమ్మలేదు. అబద్దం అనుకున్నాను. మీడియా వాళ్ళు అడుగుతున్నా నేనేమి మాట్లాడలేక పోయాను. నేను చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నేనొక మూవీ షూటింగ్ లో ఉన్నాను. కాళ్ళు, చేతులు ఆడలేదు నాకసలు. వెళ్ళాను కనీసం చూడడానికి ఏం లేదు కదా అని నేను వెళ్ళలేదు. నెల రోజుల తరువాత వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళాను. గుమ్మంలోనే సౌందర్య, వాళ్ళ నాన్న, అన్నయ్య కలిసి ఉన్న ఫోటో చూసి చాలా బాధేసింది.

యాంకర్: ఆమె గురించి రెండు మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు.

ఆమని: చాలా మంది మేకప్ వేస్తేనే అందంగా ఉంటారు. కానీ తాను మాత్రం నార్మల్ గా ఉన్న దేవతలా ఉండేది. ఇంకేమి చెబుతాను. దేవతే. చాలా అందంగా ఉండేది విడిగా కూడా. అందుకే ఆ దేవతల్లోనే కలిసి పోయింది. అంటూ చాలా ఎమోషన్ అయ్యారు ఆమని.

తాను చాలా పద్దతిగా ఉండేది. ఇలానే ఉండాలి అని ఒక సిస్టంని ఫాలో అయ్యేది. నేను ఇలానే ఉంటాను అనేది. అలానే ఉండేది. తన గురించి మాట్లాడుతుంటే ఎందుకో చాలా ఎమోషన్ అయ్యిపోతాను. తనకి అసలు ఏమి తెలియదు. అన్ని వాళ్ళ నాన్న గారే చూసుకునే వారు. కానీ ఇంత కస్టపడి సంపాదించి చివరికి ఏమి అనుభవించకుండా వెళ్ళిపోయింది. అందుకే చాలా బాధగా ఉంది. వాళ్ళ నాన్న తరువాత వాళ్ళ అన్నయ్య అంత చూసుకున్నారు. అంత ఇన్నోసెంట్ గా ఉండేది. తనకి ఎన్నో ఆశలుండేవి. ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలి. తన భర్త, పిల్లల గురించి చాలా అనుకుంటూ ఒక రూల్ పెట్టుకుంది. సినిమా వేరు… ఫ్యామిలీ వేరు అంటుండేది.

తనకి వాళ్ళ నాన్న గారంటే చాలా ఇష్టం. ఎంతంటే ఆయన ఏది చెబితే అదే చేసేది. ఇది వద్దు అంటే ఆ పని ఎవ్వరు చెప్పిన చేసేది కాదు. ఆయన సడన్ గా చనిపోయినప్పుడు అన్ని వాళ్ళ అన్నయ్యే అయ్యాడు. చివరికి వాళ్ళ అన్నయ్యతో పాటే తాను కూడా వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ గారు కూడా ఈ మధ్యే చనిపోయారని తెలిసింది. అది కూడా జగపతి బాబు చెప్తే తెలిసింది. చాలా బాధేసి వాళ్ళ ఇంటి వైపు వెళ్లి చూశాను. ఇప్పుడు ఆ ఇల్లు ఓ పాడుపడిపోయిన ఇల్లులా మారిపోయింది.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM