పచ్చి తాగుబోతు... పారిశ్రామిక వేత్తగా మారిన వైనం | anaganaga oka rowdy
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం బాగా నడుస్తుంది. అది కూడా కేవలం సెలబ్రిటీల మీద మాత్రమే సినిమాలు వస్తున్నాయి. అంతేకాక సమాజంలో ప్రముఖ వ్యక్తుల నిజ జీవితకథలను బయోపిక్లుగా వెండితెరపై ఆవిష్కరించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా తొలిసారిగా ఓ సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మనుయజ్ఞ.
ప్రస్తుతం హీరో సుమంత్తో అనగనగా ఒక రౌడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనుయజ్ఞ. ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు.. ఒక సమయంలో రియలైజ్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదిగి.. ఆ సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి నలుగురికి ఎలా ఆదర్శప్రాయంగా నిలిచాడు అనేది కథ. మురళి కున్నుం పురత్ అనే సామాన్య వ్యక్తి జీవితంలోని యదార్థ సంఘటనలతో, ఆయన నిజజీవిత కథతో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. డబ్ల్యూఎమ్ మూవీస్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేఎమ్ రాజీవ్
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…