పచ్చి తాగుబోతు... పారిశ్రామిక వేత్తగా మారిన వైనం | anaganaga oka rowdy
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం బాగా నడుస్తుంది. అది కూడా కేవలం సెలబ్రిటీల మీద మాత్రమే సినిమాలు వస్తున్నాయి. అంతేకాక సమాజంలో ప్రముఖ వ్యక్తుల నిజ జీవితకథలను బయోపిక్లుగా వెండితెరపై ఆవిష్కరించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా తొలిసారిగా ఓ సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మనుయజ్ఞ.
ప్రస్తుతం హీరో సుమంత్తో అనగనగా ఒక రౌడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనుయజ్ఞ. ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు.. ఒక సమయంలో రియలైజ్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదిగి.. ఆ సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి నలుగురికి ఎలా ఆదర్శప్రాయంగా నిలిచాడు అనేది కథ. మురళి కున్నుం పురత్ అనే సామాన్య వ్యక్తి జీవితంలోని యదార్థ సంఘటనలతో, ఆయన నిజజీవిత కథతో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. డబ్ల్యూఎమ్ మూవీస్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేఎమ్ రాజీవ్
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…