మైత్రీ మూవీ మేకర్స్లో నందమూరి హీరో చిత్రం ప్రారంభం | Nandamuri Hero movie
Nandamuri Hero movie: టాలీవుడ్లో టాప్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్.. తమ బ్యానర్లో మరో చిత్రాన్ని ప్రారంభించుకుంది. ఇప్పటికే ‘ఉప్పెన’ వంటి సక్సెస్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తున్న ఈ బ్యానర్ ఇప్పుడు నందమూరి కల్యాణ్ రామ్తో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని ప్లాన్ చేసింది. ఒక్క కల్యాణ్ రామే కాదు.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహ బాలయ్య, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వంటి హీరోలతో కూడా తమ చిత్రాలు వరుసగా ఉండబోతున్నాయని ఇటీవల నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
అందులో ముందు వరుసలో ఉన్న హీరో నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.14 గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో కల్యాణ్ రామ్, నిర్మాత నవీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ .. చిత్ర దర్శకుడు రాజేంద్రకు స్క్రిప్ట్ను అందించారు. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎర్నేని అనిల్,
సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేంద్ర.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…