Power star Pawan Kalyan and Rana daggubati combination in sithara entertainments movie regular shoot started, పవన్ కల్యాణ్, రానా కాంబో చిత్ర షూటింగ్ మొదలైంది
టాలీవుడ్ అగ్రనటుడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాలదేవ రానా దగ్గుబాటిల కాంబినేషన్లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్ర రెగ్యులర్ షూటింగ్ సోమవారం (జనవరి 25) ప్రారంభం అయింది. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్నివేశాలకు శ్రీకారం చుట్టారు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర. పవర్స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తున్న విషయం విదితమే.
చిత్ర షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘పవర్స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి.. ఇద్దరూ పాల్గొనగా పది రోజులపాటు హైదరాబాద్లో చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాము. మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్రివిక్రమ్ సపోర్ట్ మరిచిపోలేనిది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.
ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏ.ఎస్. ప్రకాష్.. ఇప్పటివరకు ఎంపిక అయ్యారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియపరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి సమర్పకులుగా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. పి.ఆర్.ఓ: యల్.వేణుగోపాల్.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…