కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యానర్పై కొత్త సినిమా ప్రారంభం Vinuthna Celluloid India Pvt Ltd Production No 1 Launched
క్రిస్పి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో, కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యానర్పై, పోతురాజు నర్సింహారావు, కందిమల్ల సాయితేజ నిర్మాణంలో, ఊర శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నం.1 చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
యస్వంత్, సాయితేజ, అరుషి, నిఖిల హీరోలు హీరోయిన్లుగా నటించే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలించాంబర్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ న్యూస్ ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు, రచయిత బిక్కి కృష్ణ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ సినిమా నిర్మాణంలో నా వంతు బాధ్యత తీసుకుంటా. మంచి టాలెంట్ ఉన్న ఊర శ్రీను గొప్ప దర్శకుడు అవుతాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా వంద కోట్లు సాధిస్తున్న రోజులు ఇవి. ఈ సినిమా కూడా అలాంటి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.
లిరిక్ రైటర్ కళారత్న బిక్కి కృష్ణ మాట్లాడుతూ… సాహిత్య విలువలు ఉన్న పాటలు రాశాను. ఈ సినిమాకు రామసత్యనారాయణ సహకారం ఉంటుంది.
చిత్ర నిర్మాత పోతురాజు నర్సింహారావు మాట్లాడుతూ… మా అబ్బాయి హీరోగా చేస్తున్నాడు. అందరి సహకారం ఉండాలి. కొత్త తరం నటులను ఆశీర్వదించండి.
డైరెక్టర్ ఊర శ్రీనివాస్ మాట్లాడుతూ… మా సస్పెన్స్ triller అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ అవుతుందని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ ఆత్రేయ మాట్లాడుతూ… పాటలు బాగా వచ్చాయి. నాలుగు పాటలు ఉన్నాయి. మ్యూజికల్ హిట్ కూడా అవుతుందని నమ్మకం ఉంది. సినిమాను సూపర్ హిట్ చేయాలి.
హీరోలు యస్వంత్, సాయితేజమాట్లాడుతూ… మా తొలి సినిమను ఆదరించాలి.
హీరోయిన్లు ఆరుషి, నిఖిల మాట్లాడుతూ… అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు. యూత్ కు నచ్చే సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాం.
మాటల రచయిత దాసరి వెంకట్ మాట్లాడుతూ… ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోకు ధన్యవాదాలు. ఊపిరి బిగబట్టుకుని చూసే సస్పెన్స్ క్రిస్పీ థ్రిల్లర్ ఇది. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
కథ రచయిత సుస్మా ప్రియదర్శిని మాట్లాడుతూ… థ్రిల్లర్ అండ్ కామెడీ మిక్స్ చేసి తీస్తున్న సినిమా ఇది. అందరిని ఆకట్టుకుని హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…