పాల గ్లాస్ అనుకున్నారా?.. కాదు కల్లు గ్లాస్!! singer sunitha takes palm wine
సింగర్ సునీత.. ఈమె తెలియని వారుండరు. ఎందుకంటే తన అందమైన గాత్రంతో ఎందరినో మైమరపించి, మంత్రముగ్దుల్ని చేసేసింది. సంప్రదాయమైన చీరకట్టుతో ఎప్పుడు నవ్వుల పువ్వులు పూయిస్తూ ఆకట్టుకుంటుంది. ఎన్నో అద్భుతమైన పాటలు ఈమె సొంతం. ఈమధ్యే ఈమె రెండవ పెళ్లి చేసుకుని మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. పెళ్లి తరువాత ఈమెలో ఉన్న జోష్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ మధ్య తరచూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఇంకాస్త దగ్గరయ్యి తన భర్త, మ్యారేజ్ తరువాత తాను ఎంత సంతోషంగా ఉందో తన ప్రేక్షకులతో పంచుకుంటుంది. అటువంటిదే తాజాగా మరో విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకుంది.
అదేమిటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రగతి రిసార్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఓ చల్లని పానీయం ఉన్న గ్లాస్ తో ఫొటోలకి ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పానీయం పాలో, మజ్జిగో అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అది స్వచ్ఛమైన తాటి కల్లు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు గాయత్రీ భార్గవి, మరి కొందరు తనతో పాటు కల్లు గ్లాసులతో కనిపించారు.
ఈ వెచ్చటి వేసవి కాలంలో చల్లటి తాటి కల్లు తాగడం అనేది చాలా ప్రదేశాలలో జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలా సెలబ్రిటీలు కల్లు గ్లాసులతో కనిపించటం అనేది మాత్రం విచిత్రమే. అసలు ఇంతకీ ఆ కల్లుని సునీత అండ్ టీం తాగారా లేదా అనేది సెకండ్ థింగ్. కానీ ఇలా గ్లాసులతో దర్శనమిస్తే ఇంకేముంది గోరంతని కొండంత చేసే మన సోషల్ మీడియా మాత్రం తాగారనే చెబుతుంది. అదీ అసలు సంగతి. మరికొందరైతే.. కొత్తగా పెళ్లి అయినా ఈ అమ్మడి చేతిలో పాల గ్లాసు కనిపించాలి కానీ.. ఇలా కల్లు గ్లాస్ ఏమిటి? అనే వారు కూడా లేకపోలేదు.. ఏదిఏమైతేనేం.. ప్రస్తుతం ఈ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…