health benefits with turmeric power, పసుపుతో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?
ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆయుర్వేదం లాంటి సహజ సిద్ధ పద్దతులపై ప్రజలలో అవగాహన పెరిగింది. మన ఇంట్లో వస్తువులే మనకి ఎంతగా ఉపయోగపడతాయో తెలుసుకుంటే డాక్టర్లతో అంతగా అవసరం ఉండదు. అలాంటి వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాటిల్లో పసుపుకి చాలా ప్రాధాన్యం ఉంది. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా పసుపు ఎంతగా ఉపయోగమో చాలా మందికి తెలిసివచ్చింది. జలుబు చేసినప్పుడు వేడి నీటిలో పసుపు కలిపి ఆవిరిపట్టే విధానం చాలా మందికి తెలిసిందే. ఇలా కేవలం వంట కోసం మాత్రమే ఉపయోగించే పసుపుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పసుపు వల్ల ప్రయోజనాలు:
– ఆడుకునే సమయంలో తరచూ పిల్లలు పడుతూ ఉంటారు. దెబ్బలు తగులుతుంటాయి. హాస్పిటల్ అందుబాటులో లేనప్పుడు ముందుగా మనం చేసే ప్రథమ చికిత్సకు ఔషధంలా పనిచేసేది ఇంట్లో ఉండే పసుపు అనేది చాలా మందికి తెలియదు. కొద్దిగా పసుపుని గాయమైన చోట పెట్టినట్లయితే.. అందులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాల వలన రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే చిటికెడు పసుపుని పాలలో కలిపి ఇవ్వడం వలన కూడా ప్రయోజనం ఉంటుంది.
-ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం తురుము, అర టీస్పూన్ పసుపు కలిపి మరిగించి, వడకట్టి తాగినట్లయితే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. కొవ్వు కరిగించుకునేందుకు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో తెలియంది కాదు. అలాంటి వారంతా ఈ విధానాన్ని చేసి చూడండి.. అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం.
– కొద్దిగా పసుపు, టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా చేసి పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసి ఒక 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తూ అనూహ్యమైన మార్పును చూస్తారు.
-పసుపుని కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆముదం లాంటి నూనెలతో కలిపి కాలిన గాయాలపై రాసినట్లైతే ఆ గాయాలు త్వరగా మానతాయి. ఇవే కాదు.. పసుపు వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని మరో అప్డేట్లో తెలుసుకుందాం.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…