health benefits with turmeric power, పసుపుతో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?
ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆయుర్వేదం లాంటి సహజ సిద్ధ పద్దతులపై ప్రజలలో అవగాహన పెరిగింది. మన ఇంట్లో వస్తువులే మనకి ఎంతగా ఉపయోగపడతాయో తెలుసుకుంటే డాక్టర్లతో అంతగా అవసరం ఉండదు. అలాంటి వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాటిల్లో పసుపుకి చాలా ప్రాధాన్యం ఉంది. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా పసుపు ఎంతగా ఉపయోగమో చాలా మందికి తెలిసివచ్చింది. జలుబు చేసినప్పుడు వేడి నీటిలో పసుపు కలిపి ఆవిరిపట్టే విధానం చాలా మందికి తెలిసిందే. ఇలా కేవలం వంట కోసం మాత్రమే ఉపయోగించే పసుపుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పసుపు వల్ల ప్రయోజనాలు:
– ఆడుకునే సమయంలో తరచూ పిల్లలు పడుతూ ఉంటారు. దెబ్బలు తగులుతుంటాయి. హాస్పిటల్ అందుబాటులో లేనప్పుడు ముందుగా మనం చేసే ప్రథమ చికిత్సకు ఔషధంలా పనిచేసేది ఇంట్లో ఉండే పసుపు అనేది చాలా మందికి తెలియదు. కొద్దిగా పసుపుని గాయమైన చోట పెట్టినట్లయితే.. అందులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాల వలన రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే చిటికెడు పసుపుని పాలలో కలిపి ఇవ్వడం వలన కూడా ప్రయోజనం ఉంటుంది.
-ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం తురుము, అర టీస్పూన్ పసుపు కలిపి మరిగించి, వడకట్టి తాగినట్లయితే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. కొవ్వు కరిగించుకునేందుకు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో తెలియంది కాదు. అలాంటి వారంతా ఈ విధానాన్ని చేసి చూడండి.. అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం.
– కొద్దిగా పసుపు, టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా చేసి పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసి ఒక 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తూ అనూహ్యమైన మార్పును చూస్తారు.
-పసుపుని కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆముదం లాంటి నూనెలతో కలిపి కాలిన గాయాలపై రాసినట్లైతే ఆ గాయాలు త్వరగా మానతాయి. ఇవే కాదు.. పసుపు వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని మరో అప్డేట్లో తెలుసుకుందాం.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…