Politics

vijayasai reddy: వైసీపీలో విజయసాయికి ప్రియారిటీ తగ్గిపోయిందా!?

ఏపీ: వైసీపీ రాజ్యసభ సభ్యుడు, కీలక నేత విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీలో నంబర్-02గా అన్ని కార్యక్రమాలు చక్కబెడుతూ వస్తుండేవారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీ కనివినీ ఎరుగని స్థాయిలో ఘన విజయం సాధించడంలోనూ సాయిరెడ్డి పాత్ర చాలానే ఉంది. ఫలితాల అనంతరం ఆయనకు కేంద్రంలోని బీజేపీతో కలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో.. అటు ఢిల్లీ రాజకీయాల్లో ఈయన కీలక వ్యక్తిగానే ఉంటూ వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఈ మధ్య సాయిరెడ్డి పెద్దగా కనిపించట్లేదు. సొంత పార్టీ నేతలే.. మరీ ముఖ్యంగా ఆయనకుండే నంబర్-02 అనే ముద్రను పీకేయడానికో తెలియట్లేదు కానీ పెద్దగా పట్టించుకోవట్లేదట.

జగన్ ఎక్కడికెళ్లినా.. ఏ మీటింగ్ జరిపినా.. సీఎంకు రైట్ హ్యాండ్‌గా ఉండే విజయసాయి ఈ మధ్య జగన్ పక్కన ఎక్కడా కనిపించట్లేదు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం బయటికి రావట్లేదు. దీంతో సాయిరెడ్డికి అనుకూలంగా ఉండే కొందరు నేతలు ఆయన పరిస్థితే అలా ఉంటే.. ఆయన్ను నమ్ముకున్న వారి పరిస్థితేంటి..? అన్నట్లు ఆలోచనలో పడ్డారట. వాస్తవానికి ప్రతిపక్షాలు చేసే విమర్శలు మీడియా మీట్ పెట్టి మరీ ఓ రేంజ్‌లో విరుచుకుపడే విజయసాయి ఇప్పుడు ఎక్కడో ఒకటి అరా వేదికల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఆ మధ్య రామతీర్థం ఘటనప్పుడు మాత్రమే కనిపించారు. ఆ తర్వాత కనిపించట్లేదు. ఆయనకు కోరలు కత్తింరించేశారని కొందరు సొంత పార్టీ నేతలు అంటుంటే..? ఇంకొందరు మాత్రం అసలు వైసీపీలో ఏం జరుగుతోంది..? అంటూ ప్రశ్నించుకుంటున్నారట. మరికొందరు మాత్రం సాయిరెడ్డి అనవసరం లేనిపోని విమర్శలు గుప్పిస్తూ.. అక్కర్లేని విషయాల్లో వేలు పెడుతుంటాడు కాబట్టి జగన్ తోక కత్తిరించారనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇదివరకు సాయిరెడ్డి చేసే పనులన్నీ చాలా వరకు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ స్థానాన్ని ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి భర్తీ చేస్తున్నారట. మీడియా ముందుకు రావడం.. చంద్రబాబు మొదలుకుని ఎవర్నయినా సరే విమర్శించేయడం చేస్తున్నారు. వాస్తవానికి సీఎం జగన్‌కు సాయిరెడ్డి ఎంతో.. సజ్జల కూడా అంతేనని అప్పట్లో టాక్ నడిచేది. ఆయన మంచి బిజినెస్‌మెన్.. పైగా జగన్‌ ఏ బహిరంగ సభలో మాట్లాడాలన్నా స్క్రిప్ట్ కూడా రాస్తారట. ఇవన్నీ అటుంచితే సజ్జలది.. జగన్ సొంత ఇలాకానే.. సొంత సామాజిక వర్గమే. అందుకే జగన్‌ కూడా సజ్జలకు అంత ప్రియారిటీ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇందులో నిజానిజాలెంటో అటు సాయిరెడ్డికి.. ఇటు సజ్జలకు.. వీరిద్దరి పైనుండే ఆ సీఎం జగన్‌కే తెలియాలి మరి.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM