‘అల వైకుంఠపురంలో..’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఆర్య, ఆర్య2 చిత్రాల తరువాత హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రాన్ని వరుస బ్లాక్బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌస్గా టాలీవుడ్లో పేరుగాంచిన మైత్రీ మూవీ మేకర్స్ మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. టైటిల్, ఫస్ట్ లుక్, షూటింగ్ అప్డేట్లకి వచ్చిన క్రేజ్ వరల్డ్ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్నే కాకుండా తెలుగు ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్లో పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూట్ షెడ్యూల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో పాటు చిత్రంలో ఉన్న ఇతర తారాగణం పాల్గొంటున్నారు.
ఈ షూటింగ్ కోసం వణికిస్తున్న చలిలో అడవిప్రాంతంలో అల్లు అర్జున్తో పాటు చిత్రయూనిట్ అంతా తెల్లవారుజామున 4 గంటలకి లేచి షూటింగ్ కార్యక్రమాల్లో బిజీ అవ్వటం విశేషం. ఎంతకష్టమైనా సరే అభిమానులకి, ప్రేక్షకులకి మంచి అవుట్పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో పుష్ప యూనిట్ అంతా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో పుష్పరాజ్కి జోడిగా రష్మిక నటిస్తుంది. రష్మిక లుక్ కూడా చాలా నేచురల్గా ఉంటుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఆడియోకి ఒక క్రేజ్ వుంటుంది. అలాగే మైత్రిమూవీస్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చే ఆడియోకి ఓ క్రేజ్ ఉంటుంది. ఇప్పడు వీరందరి కాంబినేషన్ లో వస్తున్న ఈ పుష్ఫ ఆడియోకి క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ విజువల్స్ అల్లు అర్జున్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తచేసి తెలుగు, తమిళ, మళయాల, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 13న విడుదల చేయటానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం తప్పకుండా అన్ని తరహా ప్రేక్షకుల్ని ఆకట్టకునేలా ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సహనిర్మాత: ముత్తంశెట్టి మీడియా
డైరెక్టర్: సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
స్టైలింగ్: దీపాలి నూర్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ, మౌనిక
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను – మధు
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్ప్రైజెస్,…
నేషనల్, అక్టోబర్xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో…
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…
యష్రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…