మెగాస్టార్.. నువ్వు సామాన్యుడివి కాదు బాస్ | Megastar Chiranjeevi
Megastar Chiranjeevi: ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని ప్రతి చిన్న విషయాన్ని తమ ఫోన్లలో బంధించేస్తున్నారు. అది ఎటువంటి అకేషన్ అయినా సరే, అంటే పుట్టిన రోజు వేడుకైనా, పెళ్లి రోజు వేడుకైనా, పిల్లల నవ్వులు, ఇలా ఎన్నో విషయాలని తమ స్మార్ట్ ఫోన్లలో బంధించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. ఇటువంటి వాటిల్లో మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ముందు వరుసలో ఉంటున్నారు. అందులోను మెగా ఫ్యామిలీ గురించి ముందుగా చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో ముందు ఉంటారు. ప్రకృతి అందాల్ని తన ఫోన్లో బంధించి తన అభిమానులతో వాటిని పంచుకుంటూ ఉంటారు. అటువంటిదే ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో సోమవారం పోస్ట్ చేశారు.
ఇంత పెద్ద సిటీలో సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటివి చూడడానికి ఒక యజ్ఞమే చేయాలి. కానీ చిరంజీవి మాత్రం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ణి కెమెరాలో బంధించారు. అది కూడా స్విమ్మింగ్ ఫూల్ లో ఉదయిస్తున్న సూర్యుణ్ణి వీడియో రూపంలో తన ప్రేక్షకులకి అందించారు. ‘‘ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు గడిచినా.. ఖగోళ అందాలైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఆ క్షణాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. మా ఇంటి ఆవరణలో ఆవిష్కృతమైన అటువంటి ఓ అందమైన ఉదయాన్ని మీతో పంచుకుంటున్నాను’’ అని తెలుపుతూ.. ఆయన క్యాప్చర్ చేసిన వీడియోని షేర్ చేశారు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చేయనున్నారు. అనంతరం మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో చిత్రాలు సైన్ చేసి ఉన్నారు. త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది. ఇక మెగాస్టార్ షేర్ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నువ్వు సామాన్యుడివి కాదు బాస్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…