అన్న సినిమాకి క్లాప్.. తమ్ముడి సినిమాకి ట్రైలర్ లాంఛ్ | Mega and Nandamuri support
రెండు రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ‘ఉప్పెన’ సినిమా వార్తే. ఎందుకంటే మెగా హీరో నటించిన ఈ చిత్ర ట్రైలర్ను నందమూరి హీరో లాంఛ్ చేయబోతున్నారు. మెగా, నందమూరి కలయిక అంటే అది ఎప్పుడూ హాట్ న్యూసే. అందుకే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి అంత క్రేజ్ ఏర్పడింది.
ఇప్పుడు మళ్లీ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్ర ట్రైలర్ను నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేస్తున్నాడని చిత్రయూనిట్ అఫీషియల్గా ప్రకటించడంతో ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు. వాస్తవానికి మెగా హీరోకి ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకు ముందు కూడా ఓ మెగా హీరో చిత్రానికి యంగ్ టైగర్ సపోర్ట్ చేశారు.
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ చిత్ర ఓపెనింగ్ ఫంక్షన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరై క్లాప్ కొట్టారు. ఇప్పుడు సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’కు ట్రైలర్ లాంఛ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఈ చిత్ర ట్రైలర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రెండు చిత్రాలకు మెగా హీరోలు కూడా అటెండ్ అయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘బాద్షా’ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్ కొట్టిన విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు.
మరో నందమూరి హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ రూపొందించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్ర ఓపెనింగ్కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇలా మెగా, నందమూరి హీరోలు సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…