నితిన్ సినిమాలో ఒకే ఒక్క పాట.. నిరాశలో ఫ్యాన్స్ | only one song in check movie
Nithiin Check: యూత్ స్టార్ నితిన్ సినిమాలో ఒకే ఒక్క పాట అంటే.. ఆయన అభిమానులు నిరాశచెందడం ఖాయం. కానీ ఇది నిజంగా నిజం. నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘చెక్’ చిత్రంలో కేవలం ఒకే ఒక్క పాట ఉంటుందని నిర్మాత వి. ఆనందప్రసాద్ ప్రకటించారు. కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ఇటీవలే ఈ సినిమాలోని ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ గీతాన్ని గోవాలో చిత్రీకరించారు. నితిన్ – ప్రియా ప్రకాశ్ వారియర్పై ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తయినట్లుగా నిర్మాత తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘గోవాలో నితిన్, ప్రియా ప్రకాశ్ వారియర్పై చిత్రీకరించిన పాటతో చిత్రీకరణ అంతా పూర్తయింది. మూడు రోజులు అందమైన లొకేషన్లలో పాటను తెరకెక్కించారు. దీనికి కల్యాణి మాలిక్ మంచి బాణీ అందించారు. శ్రీమణి చక్కటి సాహిత్యం అందించగా… శేఖర్ మాస్టర్ కనుల విందైన నృత్యరీతులు సమకూర్చారు. కథానుగుణంగా సినిమాలో ఒక్క పాటకు మాత్రమే సందర్భం కుదిరింది. కథలో సందర్భం కుదరక మరో పాటకు చోటు కల్పించలేదు. ఒక్క పాటే ఉన్నా.. అది అందరినీ అలరించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం డీటీయస్ మిక్సింగ్ జరుగుతోంది. నిర్మాణానంతర పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటిని అందుకునేలా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించారు. యాక్షన్, థ్రిల్ మేళవించిన చిత్రమిది’’ అని అన్నారు.
సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి
సంగీతం: కళ్యాణి మాలిక్,
ఛాయా గ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్,
ఆర్ట్ : వివేక్ అన్నామలై ,
ఎడిటింగ్: అనల్ అనిరుద్దన్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి,
నిర్మాత: వి.ఆనంద ప్రసాద్,
కథ – స్క్రీన్ప్లే – దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…