జాగ్రత్త.. ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ వస్తోంది | Uppena movie Release date Fixed
మెగా ఫ్యామిలీ నుంచి సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీకి విడుదల తేది ఖరారైంది. ఫిబ్రవరి 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే సంగీతంలో తన అభిరుచికి, పాటలను ప్రెజెంట్ చేసిన విధానంతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా, ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలను కూడా అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వారి స్క్రీన్ ప్రజెన్స్తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఈ టీజర్తో ‘ఉప్పెన’పై అంచనాలు భారీగా పెరిగాయి. దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చగా ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్న చిత్రంలో సాయిచంద్, బ్రహ్మాజీ వంటి వారు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సీఈవో: చెర్రీ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన హిందూ…
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…