vijay devarakonda at yadadri temple
లైగర్ పరాజయంతో కాస్త నిరుత్సాహపడ్డ రౌడిబాయ్ విజయ్ దేవరకొండకు ఖుషి కాస్త ఊరట నిచ్చిందనే చెప్పాలి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఖుషికి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగానే వున్నాయి. విజయ్ కెరీర్లోనే హాయ్యెస్ట్ ఓపెనింగ్స్ను ఖుషి సాధించిదని చెబుతున్నారు మేకర్స్. ఇదిలా వుండగా టాలీవుడ్లో బిగ్స్టార్ మొదలుకొని మీడియం స్టార్ వరకు సినిమా విడుదల తరువాత సినిమా విజయం సాధించిందని తెలియజేయడానికి సినిమా టీమ్తో కలిసి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుంటారు.అక్కడ కాస్త మీడియాతో హడావుడి చేసి వస్తుంటారు. అది అనవాయితిగా వస్తుంది.
అయితే విజయ్ దేవరకొండ ఈ విషయంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఖుషి సినిమా టీమ్తో కలిసి విజయ్ నేడు యాదగిరి గుట్టలోకి శ్రీలక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుని ఆశ్శిస్సులు అందుకున్నారు. విజయ్తో పాటుఆనంద్ దేవరకొండ, గోవర్థన్ దేవరకొండ, విజయ్ తల్లి మాధవి, దర్శకుడు శివనిర్వాణ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్లు కూడా యాదగిరి గుట్టకు వెళ్లి ఆశ్శీస్సులు అందుకున్నారు. ఇక విజయ్ శ్రీకారం చుట్టిన ఈ సంప్రదాయాన్ని ఎంత మంది సెంటిమెంట్గా పాటిస్తారో చూడాలి. ఇటీవల యాదగిరి గుట్ట దేవాలయాన్ని వందలకోట్లు ఖర్చుపెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన సంగతి తెలిసిందే
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…