లగేజి లేకుండా విమాన ప్రయాణమా.. అయితే ఈ బంపరాఫర్ మీకే!
మీరు విమాన ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? ఈ ప్రయాణాల్లో ఎటువంటి లగేజ్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదా? అయితే మీలాంటి వారి కోసమే ఓ భారీ ఆఫర్ వచ్చేసింది. ఇలా భారీ లగేజి ఏదీ లేకుండా విమాన ప్రయాణం చేయాలని అనుకునే వారికి విమాన ప్రయాణ చార్జీల్లో ఇక నుంచి డిస్కౌంట్ లభించనుంది. కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణం చేసే వారికి ఈ రాయితీ వర్తిస్తుందట. ఈ మేరకు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి కొత్తగా మార్గదర్శకాలు విడుదల అయినట్లు తెలుస్తోంది. ఓ సారి ఈ ఉత్తర్వులను పరిశీలిస్తే..
లగేజ్ లేకుండా ప్రయాణించే వారికి త్వరలో టికెట్ ధరల్లో రాయితీ కల్పిస్తామని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇకపై చెక్ ఇన్ లగేజ్ లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి టికెట్లపై రాయితీలు దొరుకుతాయి. ఈ మేరకు దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ నుంచి శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 26న ఉత్తర్వులు అందాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం… విమాన ప్రయాణికులు ఏడు కిలోల వరకు క్యాబిన్ బ్యాగేజ్, 15 కిలోల వరకు చెక్ ఇన్ లగేజ్ తమ వెంట తీసుకొని వెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళితే.. అదనపు చార్జీలు వసూలు చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం… ఇకపై చెక్ ఇన్ బ్యాగ్లు లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలో రాయితీలు ఇస్తాయి.
ఈ రాయితీలు పొందాలంటే… ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తమ వెంట తీసుకెళ్లే బ్యాగ్ బరువు వెల్లడించాల్సి ఉంటుంది. ‘‘ఎయిర్లైన్ బ్యాగేజీ పాలసీ మేరకు… విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత బ్యాగేజ్ అలవెన్సులతో పాటు జీరో బ్యాగేజ్/నో చెక్ ఇన్ బ్యాగేజ్ ధరల స్కీంను అందించేలా అనుమతి ఇస్తున్నాం. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఈ టికెట్ ధరల స్కీం గురించి వారికి తెలియజేయాలి. ఇక ఈ వివరాలను టికెట్పై తప్పనిసరిగా ప్రింట్ చేయాలి’ అని డీజీసీఏ వెల్లడించింది.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…