nalgonda mellacheruvu lord shiva temple Greatness
మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క శివ క్షేత్రం భక్తులతో కిట కిటలాడింది. గత కొంత కాలంగా అన్ని దేవాలయాలు వాటి శోభను కోల్పోయి వెలవెల బోయాయి. ఇలా భక్తులతో దేవాలయాలు కళ కళ లాడుతుండడం చూస్తుంటే మరలా ఆ వైభవం వచ్చిందా అనిపిస్తుంది. కాగా నల్లగొండ జిల్లాలో కృష్ణానది తీరాన వెలసిన శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే స్వామి వారి శిరో భాగం ఎప్పుడు నీరు కారుతూ ఉండడమే. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో గల శైవక్షేత్రాల్లో ఒకటైన ఈ శంభు లింగేశ్వర స్వామి ఆలయం మేళ్లచెరువు మండలంలో ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవులు నిర్మించారు. అక్కడి ప్రజలు ఈ ఆలయం గురించి, ఆలయ ప్రాముఖ్యతను గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు.
కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుండేవారని, వారి బాధలు చూడలేక ఆ పరమ శివుడే స్వయంగా వారి బాధలు తీర్చడం కోసం ఈ మేళ్లచెరువు అటవీ ప్రాంతంలో వెలిసినట్లు చెబుతుంటారు. అలా వెలసిన శివుడికి ఆవుల మందలోని ఒక ఆవు నిత్యం తన పొదుగు నుండి పాలను వదిలేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక యాదవ రాజు అది గమనించి… ఆ శివ లింగాన్ని గొడ్డలితో 11 ముక్కలుగా నరికి వాటిని 11 ప్రదేశాలలో విసిరేశాడట. కానీ మరలా ఆ శివలింగం యధావిధిగా ఉండేదట.
ఇదిలా ఉండగా ఒక రోజు గంగబోయిన మల్లన్న అనే యాదవ రాజుకు స్వామి కలలోకొచ్చి, ఈ ప్రాంతం రానున్న కాలంలో దక్షిణ కాశీగా పేరు పొందుతుందని చెప్పడంతో… ఆయన వెంటనే ఈ ఆలయాన్ని నిర్మించారట. అప్పటి నుండి ఆ శివలింగం పెరుగుతూ ఉంటుందట. ఈ లింగం పై భాగంలో గంగమ్మ ఉందని.. ఎప్పుడూ నీరు వస్తూ ఉంటుందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఎంత తీసినా ఆ నీరు అలా ఊరుతూనే ఉంటుందట. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది ఇక్కడికి వస్తు ఉంటారు. మార్చి 11, శివరాత్రి కావున ఈ ఆలయం భక్తులతో కళ కళలాడింది.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…