nalgonda mellacheruvu lord shiva temple Greatness
మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క శివ క్షేత్రం భక్తులతో కిట కిటలాడింది. గత కొంత కాలంగా అన్ని దేవాలయాలు వాటి శోభను కోల్పోయి వెలవెల బోయాయి. ఇలా భక్తులతో దేవాలయాలు కళ కళ లాడుతుండడం చూస్తుంటే మరలా ఆ వైభవం వచ్చిందా అనిపిస్తుంది. కాగా నల్లగొండ జిల్లాలో కృష్ణానది తీరాన వెలసిన శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే స్వామి వారి శిరో భాగం ఎప్పుడు నీరు కారుతూ ఉండడమే. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో గల శైవక్షేత్రాల్లో ఒకటైన ఈ శంభు లింగేశ్వర స్వామి ఆలయం మేళ్లచెరువు మండలంలో ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవులు నిర్మించారు. అక్కడి ప్రజలు ఈ ఆలయం గురించి, ఆలయ ప్రాముఖ్యతను గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు.
కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుండేవారని, వారి బాధలు చూడలేక ఆ పరమ శివుడే స్వయంగా వారి బాధలు తీర్చడం కోసం ఈ మేళ్లచెరువు అటవీ ప్రాంతంలో వెలిసినట్లు చెబుతుంటారు. అలా వెలసిన శివుడికి ఆవుల మందలోని ఒక ఆవు నిత్యం తన పొదుగు నుండి పాలను వదిలేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక యాదవ రాజు అది గమనించి… ఆ శివ లింగాన్ని గొడ్డలితో 11 ముక్కలుగా నరికి వాటిని 11 ప్రదేశాలలో విసిరేశాడట. కానీ మరలా ఆ శివలింగం యధావిధిగా ఉండేదట.
ఇదిలా ఉండగా ఒక రోజు గంగబోయిన మల్లన్న అనే యాదవ రాజుకు స్వామి కలలోకొచ్చి, ఈ ప్రాంతం రానున్న కాలంలో దక్షిణ కాశీగా పేరు పొందుతుందని చెప్పడంతో… ఆయన వెంటనే ఈ ఆలయాన్ని నిర్మించారట. అప్పటి నుండి ఆ శివలింగం పెరుగుతూ ఉంటుందట. ఈ లింగం పై భాగంలో గంగమ్మ ఉందని.. ఎప్పుడూ నీరు వస్తూ ఉంటుందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఎంత తీసినా ఆ నీరు అలా ఊరుతూనే ఉంటుందట. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది ఇక్కడికి వస్తు ఉంటారు. మార్చి 11, శివరాత్రి కావున ఈ ఆలయం భక్తులతో కళ కళలాడింది.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…