Health

ఏపీలోనూ మళ్లీ విస్తరిస్తోన్న కరోనా.. ఎన్ని కేసులంటే?

ఒక సంవత్సర కాలం నుండి ఓ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే కరోనా. ఈ వ్యాధి వలన ఎంతో మంది తమ జీవన వ్యవస్థని కోల్పోయి అతలాకుతలమైపోయారు. ఎక్కడ చూసినా అన్ని బంద్. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ప్రపంచ వ్యాప్తిగా ఎదురైంది లేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో, నేనింకా చావలేదు అంటూ మరలా కరోనా తన పంజా విసరడం మొదలు పెట్టింది. స్ట్రెయిన్ పేరుతో మరలా విజృంభిస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క తెలంగాణనే కాదు.. ఆంధ్రాలో కూడా ఈ వ్యాధి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 200 మార్కుని దాటినట్లు తెలుస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీ లో 210 కేసులు నమోదైనట్లు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించినట్లు ఏపీ వైద్య శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా తెలుస్తుంది. గత 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,91,388 కాగా, అందులో మరణించిన వారి సంఖ్య 7180. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,82,981 కి అని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 44,709 నమూనాలను పరీక్షించినట్లు, అందులో 1227 యాక్టివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. మొత్తంగా చూసినట్లయితే 1,44,48,650 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM