Politics

Padma Awards: ఎస్పీ బాలు, చిత్రను వరించిన పద్మ అవార్డ్స్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2021కి గాను భారత ప్రభుత్వం సోమవారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. 119 మందికి పద్మ అవార్డులు.. ఏడుగురికి పద్మ విభూషణ్‌.. 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ప్రముఖ గాయకులు.. మరీ ముఖ్యంగా సౌత్ ప్రజలకు సుపరిచితులైన దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, గాయని చిత్ర ఉన్నారు. ఎవరెవరికి ఏయే అవార్డులు వరించాయి..? తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్ని అవార్డులు వరించాయి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

గాయకులు..
ఎస్పీ బాలసుబ్రహ్మణంకు పద్మ విభూషణ్‌ అవార్డు
గాయని చిత్రకు పద్మభూషణ్‌ అవార్డు

ప్రముఖులు ఇలా..
అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పద్మభూషణ్
మాజీ కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ పద్మభూషణ్‌
మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు పద్మభూషణ్‌
గుజరాత్‌ బీజేపీ నేత కేశూభాయ్‌కి పద్మభూషణ్‌

క్రీడా విభాగంలో ఏడుగురికి.. (పద్మశ్రీ అవార్డు)
పీ.అనిత (తమిళనాడు)
మౌమాదాస్‌ (పశ్చిమబెంగాల్‌)
అన్షు జంసేన్సా (అరుణాచల్‌ప్రదేశ్‌)
మాధవన్‌ నంబియార్‌ (కేరళ)
సుధా హరినారయణ్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌)
వీరేంద్ర సింగ్‌ (హరియాణా)
కే.వై వెంకటేశ్‌ (కర్ణాటక)

తెలుగు రాష్ట్రాలకు వరించిన పద్మశ్రీలు..
అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ (కళారంగం) పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవర ప్పాడు గ్రామం
నిడుమోలు సుమతికి పద్మశ్రీ (కళారంగం)
అసవాది ప్రకాశ్‌రావుకు పద్మశ్రీ(సాహిత్యం) అనంతపురం జిల్లా, సింగనమల మండలం కొరివిపల్లి గ్రామం.
శ్రీ కనకరాజుకు పద్మశ్రీ (కళారంగం). కొమురంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయి

కల్నల్ సంతోష్‌కు మహావీరచక్ర
గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన గుర్తింపునిచ్చింది. ఆయన త్యాగానికి ప్రతీకగా సంతోష్‌‌కు కేంద్రం మహావీరచక్ర పురస్కారం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందుకోనున్నారు.

తమిళనాడుకే ఎక్కువ!
ఇదిలా ఉంటే.. త్వరలో తమిళనాడులో ఎన్నికలున్న నేపథ్యంలో అధికంగా పద్మ అవార్డులు ఆ రాష్ట్రానికే కేంద్రం ప్రకటించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పీ బాలుకు కూడా తమిళనాడు కోటాలోనే అవార్డు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అయితే.. తెలుగు రాష్ట్రాలకు నాలుగు పద్మశ్రీ అవార్డులు వరించడం సంతోషించదగ్గ విషయమేనని చెప్పుకోవచ్చు.

Share
Published by
Just Teaser

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM