సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అర్థ శతాబ్ధం’ చిత్ర టీజర్ విడుదలైంది. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో, చిట్టి కిరణ్ రామోజు తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను బుధవారం సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు.
టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘అర్థ శతాబ్ధం పవర్ ఫుల్ టైటిల్. చాలా బాగుంది. టీజర్ చాలాఇంట్రస్టింగా ఉంది. రవీంద్ర టేకింగ్ ఎక్స్లెంట్గా ఉంది. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తేవాలి. ఈ సందర్భంగా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను..’’ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం..’’ అన్నారు.
కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయికుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్, రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లే, నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ, డిఓపి: ఎజే వేణు, అష్కర్, వెంకట ఆర్ శాఖమూరి; సంగీతం: నౌఫల్ రాజా(ఎ.ఐ.ఎస్).
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్ప్రైజెస్,…
నేషనల్, అక్టోబర్xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో…
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…
యష్రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…