ఇది ప్రీరిలీజ్ లా లేదు. ఇక్కడొక పండుగలా వుందంటూ.. జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన అభిమానులను, ప్రేక్షకులనుద్దేశించి అక్కినేని నాగార్జున అన్నారు. బుల్లితెర స్టార్ మహిళగా ఎదిగిన సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 6 సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ దస్పల్లాలో జయమ్మ కంప్లయింట్ అనే పేరుతో జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
వేడుకకు తగినట్లుగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ: ఇక్కడ పండుగలా వుంది. పంచాయతీ అంటే నేను రాలేదు. ప్రేమతో సుమ పిలిస్తే వచ్చాను. ఈ చిత్ర టీమ్ అంతా సుమలోని టాలెంట్ లో 10శాతం పెట్టినా పెద్ద హిట్ అవుతుందంటూ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
నాని మాట్లాడుతూ: దేవదాస్ తర్వాత నాగ్ సార్ తో ఇలా కలిశాం. సుమ నటించిన సినిమాకు మేం గెస్ట్గా రావడం కొత్తగా వుంది. మనందరి ఇంటిలో మనిషిగా సుమగారు అయ్యారు. ఇండస్ట్రీకి ఆమె చాలా చేశారు. ప్రతి సినిమా విడుదలకు ముందు సుమగారు అనే పేరు, ఆమె నవ్వు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. జయమ్మ పంచాయితీ ట్రైలర్ చూశాక, స్టేజీ మీదే కాదు వెండితెరపై కూడా అలరించిందనిపించింది. కీరవాణి సంగీతం తోడయి సినిమా చూడాలనే ఆసక్తి నెలకొంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలనీ, సుమగారు సినిమాలతో బిజీ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ: నిర్మాత బలగా ప్రసాద్ కు బి.పి. పెరిగినట్లుగా వసూళ్ళు రావాలని చమత్కరించారు. అందరూ సినిమా చూసి ఆదరించాలి. అందం, తెలివితేటలు, మంచి మనసు వున్న సుమగారికి రాజీవ్ కనకాల (ఆర్.కె.) వుంటే చాలని పేర్కొన్నారు.
సుమ మాట్లాడుతూ: ఇంటిలో టీవీలేని రోజుల్లో పక్కఇంటిలో టీవీ చూసిన రోజుల నుంచి టీవీ హోస్ట్ గా ఎదిగి ఎనర్జీగా మాట్లాడుతున్నానంటే మీ చప్పట్ల వల్ల వచ్చిన ఎనర్జీనే కారణం. మన ఇంటిలోని అమ్మాయిగా భావించడం వల్లే నాకు ఎనర్జీ వచ్చింది. మీ ప్రేమ ఆదరాభిమానాలతో తెలుగు టీవీ హోస్ట్ గా చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. చిత్ర దర్శకుడు, నిర్మాత, నటించిన నటీనటులతోపాటు కీరవాణి గారి సంగీతం మా సినిమాకు బలం చేకూరింది. నాకు శ్రీకాకుళం యాస రాదు. కానీ నాకు నేర్పించిన టీమ్ కు ధన్యవాదాలు. ఈ సినిమాకు రామ్చరణ్, నాని, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడం వల్లే హైప్ వచ్చింది. సినిమా విడుదలకు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సునీల్గారు సహకారం ఎంతో వుంది. ఆల్ హీరో ఫ్యాన్స్ నా సినిమా చూస్తారని ఆశిస్తున్నానని అంటూ, మహేష్బాబుగారు మే3న కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని తెలిపారు.
గీత రచయిత హరి రామ జోగయ్య మాట్లాడుతూ: మల్టీటాలెంట్ సుమగారు. ఝాన్సీ, సుమ వంటివారితో సినిమా తీస్తే ఎలా వుంటుందనే ఆలోచన ఒకప్పుడు కలిగేది. ఇప్పుడు సుమగారి సినిమాకు పాట రాయడం ఆనందంగా వుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో దర్శకుడు సినిమా తీసినందుకు ధన్యవాదాలు. విలేజ్ నేటివిటీతో మలయాళ సినిమాల్లో చూసేవాళ్ళం. అదేవిధంగా జయమ్మ పంచాయితీ పెద్ద విజయం సాధించాలి. జయమ్మ భోళా మనిషి. ఊరి సమస్యలు తన సమస్యలుగా భావిస్తుంది ఈ నేపథ్యంలో పాట రాయడం ఆనందంగా వుందని అన్నారు.
ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ ఎంతో బాగున్నాయనీ, సినిమా మంచి విజయం సాధించాలని మరో గీత రచయిత చంద్రబోస్ ఆకాంక్షించారు.
చిత్ర దర్శకుడు విజయ్ మాట్లాడుతూ: ఓసారి జర్నీ చేస్తుండగా ఓ సైంటిస్ట్ కలిసి నేను దర్శకుడు అని తెలిసి సెల్ఫీ తీసుకున్నాడు. జయమ్మ పంచాయితీ మోషన్ పోస్టర్ ను రామ్చరణ్ ఆవిష్కరించాడనే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. ఏ రంగంలోనివారికైనా సినిమా అంటే క్రేజీనే. ఏదో చిన్న కథతో సినిమా తీయాలనుకున్న నాకు సుమ గారు ఈ కథలోకి రావడం, ఆ తర్వాత సినీ ప్రముఖులు ప్రమోషన్ కు సహకరించడం అదృష్టంగా భావిస్తున్నా. సుమగారి నటన గురించి వర్ణించలేం. ఎంతమందితో ఫొటో దిగినా అన్నింటిలోనూ హావభావాలు భిన్నంగా చూపుతారు. ఈ సినిమాకు కీరవాణి గారు పనిచేయడం ఆనందంగా వుంది. కీరవాణి గారు మా టీమ్ కు జేమ్స్ బాండ్ లాంటి వారని ఎంతో ఎనర్జీ మాకు ఇచ్చారని అన్నారు.
యాంకర్ సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ: నాకు యాంకరింగ్ లో గురువు ప్రదీప్. మా ఇద్దరికీ గురువు సుమగారు. 20 ఏళ్ళుగా నెంబర్1 యాంకర్ గా సుమ గారు ఎంటర్ టైన్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా మాలాంటి ఎంతో మందికి ఆరోగ్య సమస్యలప్పుడు సహకరించారు. అలాంటి సుమ గారి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ: సుమ గారు టీవీ హోస్ట్ గా చేయకపోతే మేము వెలుగులోకి వచ్చేవారం కాదు. మాకు స్పూర్తిదాయకంగా నిలిచి దారి చూపారు. మాకు ఆవిడే సచిన్, ధోనీ.. ఇండియన్ టెవివిజన్ లో ఏకైక ప్రజెంటర్ సుమ కనకాల గారే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. లాక్డౌన్లో కూడా సెల్ఫోన్తో యూట్యూబ్ కు షోలు చేసి సక్సెస్ అయ్యారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి వ్యక్తిగత పనుల వల్ల హాజరు కాలేకపోతున్నామనీ రాజమౌళి, కె. రాఘవేంద్రరావు వీడియో ద్వారా తెలియజేస్తూ, జయమ్మ పంచాయితీ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, గాయకుడు శ్రీకృష్ణ, కెమెరామెన్ అనూష్, దినేష్ కుమార్, షాలినీ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్ప్రైజెస్,…
నేషనల్, అక్టోబర్xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో…
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…
యష్రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…