వాట్సాప్ వద్దనుకునే వారు.. ఇది తప్పని సరిగా చేయాలి | whatsapp backup messages
ఇటీవలే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చింది. దీనిపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది. ఈ పాలసీని చూసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ వాడాలని ఓ ట్వీట్ చేశాడు. దీంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు సిగ్నల్ బాట పట్టారు. తమ వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేసేస్తున్నారు. దీనిపై వాట్సాప్ వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అంత వివరణ ఎందుకు? ఈ నిబంధనలతో సాధారణ యూజర్ల డేటా సేకరించబోమని చెప్పినప్పుడు అసలు ఈ పాలసీ ఎందుకు తీసుకురావడం? అని వినియోగ దారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడి అయ్యింది. నూటికి 50 శాతం మంది వాట్సాప్ యూజర్లు కొత్త పాలసీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సదరు సర్వే తెలిపింది.
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై చాలా మంది యూజర్లు చిర్రెత్తి పోయి ఉన్నారు. తమ డేటా అంతా తీసుకెళ్లి వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్బుక్కు ఇవ్వాల్సి ఉంటుందని ఈ పాలసీలో వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ పాలసీపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేవలం బిజినెస్ ఖాతాల వివరాలు మాత్రమే ఫేస్బుక్ తో పంచుకుంటామని, సాధారణ యూజర్ల డేటా సురక్షితమేనని వివరణ ఇచ్చింది.
అయినా కూడా చాలా మంది యూజర్లు సంతృప్తి చెందలేదు. వాట్సాప్ వదిలి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ సమయంలో వాట్సాప్ అకౌంట్ను, మన చాట్ హిస్టరీని డిలీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా గనుక చేయాలనుకుంటే ముందుగా సర్వర్లలోని మెసేజ్లన్నీ డిలీట్ చేయడం ఉత్తమం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
బ్యాకప్ మెసేజ్లను డిలీట్ చేసే విధానం:
వాట్సాప్ బ్యాకప్ మెసేజ్లను కూడా మనమే డిలీట్ చేయవచ్చు. మన చాట్ హిస్టరీకి సంబంధించిన బ్యాకప్ ఫైల్స్ అన్నీ కూడా /sdcard/WhatsApp/Databases/folder అనే ఫోల్డర్ లో సేవ్ అవుతాయని వాట్సాప్ చెప్తోంది. ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని ముందుగా డిలీట్ చేసేసి ఆ తర్వాత వాట్సాప్ ఖాతాను డిలీట్ చేసుకుంటే మన డేటా వాట్సాప్ దగ్గర ఉండదట.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…