Technology

ప్రీ పెయిడ్ కరెంట్ మీటర్లు.. ఏపీలో కొత్త కరెంట్‌ కష్టాలు

ఫోన్స్ కి, నెట్ లకి రీఛార్జ్ చేయించినట్లు ఇకపై కరెంట్ కి కూడా ముందే రీజార్జ్ చేయించాలంట. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారు కదా. అదే మరి మా పాలనా పనితీరు అంటుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎంత కరెంట్ వాడితే అంత మాత్రమే బిల్లు కట్టాల్సి ఉండేది. కానీ ఇకనుండి ముందు రీజార్జ్ చేసుకోండి.. అది చాలకపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంట. అలా చేయించని పక్షంలో అన్ని లైట్లు, ఫ్యాన్లు మాత్రమే కాదు మిగతా అన్ని రకాల వస్తువులు బంద్. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం ప్రీ పెయిడ్ కరెంట్ మీటర్లను బిగించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొదటిగా దీనిని ప్రభుత్వ రంగ సంస్థలలో అందుబాటులోకి తీసుకురానున్నారు అధికారులు.

అసలు ఉన్నట్లుండి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలు ఎన్నో. చాలా రకాల ప్రభుత్వ సంస్థలు, ప్రయివేట్ సెక్టార్లకి సంబంధించిన వాటిల్లో కరెంట్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని వసూలు చేయడం అనేది ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. దీనివలన విద్యుత్ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వం ఈ ప్రీ పెయిడ్ మీటర్లను బిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర అభయాన్ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో వచ్చే ఏడాది మార్చి లోపు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉన్న పోస్ట్ పెయిడ్ మీటర్ల స్థానంలో ఈ ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసి వాటి వ్యయాన్ని ప్రతి నెలా రెండు శాతం చొప్పున విద్యుత్ బిల్లు నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల పాటు వీటి పనితీరును పరిశీలించిన తరువాత అపార్ట్ మెంట్స్, ఇళ్లకు కూడా ఈ ప్రీ పెయిడ్ మీటర్లు అమరుస్తారు. ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఈ మీటర్లకు రీజార్జ్ చేసుకోవడం ఉంటుంది. ముందుగా ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని, విద్యుత్ బిల్లులు కూడా మొబైల్ బిల్లు లానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రజలు విద్యుత్ ని సమర్ధవంతంగా వాడుకోవడం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

Share
Published by
Just Teaser

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM