సౌతాఫ్రికా క్రికెట్లో నేటి తరం లెజండరీ క్రికెటర్ల పేర్లు చెబితే వాటిలో కచ్చితంగా ఉండే పేరు ఫాఫ్ డూ ప్లెసిస్. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్గా ఉన్నడూ ప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తాను టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. బుధవారం అతను చేసిన ఈ ప్రకటన ప్రపంచ క్రికెట్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. అయితే తాను తీసుకున్న నిర్ణయాన్ని డూ ప్లెసిస్ సమర్థించుకున్నాడు. తనను వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయని, ఈ కారణంగానే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కంటే వేరే నిర్ణయం తీసుకోలేమని తాను భావిస్తున్నానని, మానసికంగా రిటైర్మెంట్కు రెడీ అయ్యానని చెప్పాడు. కానీ ఈ రిటైర్మెంట్ తాను ఊహించినట్టు లేదని డూ ప్లెసిస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. తాను ఆస్ట్రేలియా టూర్ తర్వాత అసలు క్రికెట్కు పూర్తిగా గుడ్బై చెప్పేద్దామని అనుకున్నానని.. కానీ అలా చేయడం కుదరలేదని వివరించాడు. తన జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక నుంచి తాను టీ20 క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు వివరించాడు 2021, 2022లలో జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లను దృష్టిలో పెట్టుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.
డూ ప్లెసిస్ వయసు 36. తన కెరీర్లో 69 టెస్టులు ఆడాడు. 2012-13 మధ్య తొలి టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతను.. తొలి మ్యాచులోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇప్పటి వరకూ టెస్టుల్లో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు డూ ప్లెసిస్ ఖాతాలో ఉన్నాయి. 40.02 సగటుతో మొత్తం 4163 పరుగులు పూర్తి చేశాడు. 2016లో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొత్తం 36 టెస్టు మ్యాచ్లకు సారథ్యం వహించాడు. అందులో 18 గెలుపులు, 15 ఓటములు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్ప్రైజెస్,…
నేషనల్, అక్టోబర్xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో…
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…
యష్రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…