Friday, October 18, 2024

పచ్చి తాగుబోతు… పారిశ్రామిక వేత్తగా మారిన వైనం

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం బాగా నడుస్తుంది. అది కూడా కేవలం సెలబ్రిటీల మీద మాత్రమే సినిమాలు వస్తున్నాయి. అంతేకాక సమాజంలో ప్రముఖ వ్యక్తుల నిజ జీవితకథలను బయోపిక్‌లుగా వెండితెరపై ఆవిష్కరించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా తొలిసారిగా ఓ సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మనుయజ్ఞ.

ప్రస్తుతం హీరో సుమంత్‌తో అనగనగా ఒక రౌడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనుయజ్ఞ. ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు.. ఒక సమయంలో రియలైజ్ అయ్యి ఒక సక్సెస్‌ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదిగి.. ఆ సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి నలుగురికి ఎలా ఆదర్శప్రాయంగా నిలిచాడు అనేది కథ. మురళి కున్నుం పురత్ అనే సామాన్య వ్యక్తి జీవితంలోని యదార్థ సంఘటనలతో, ఆయన నిజజీవిత కథతో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. డబ్ల్యూఎమ్ మూవీస్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేఎమ్ రాజీవ్

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x