ప్రతి నిత్యం ఎందరో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. వాటిల్లో ఉండే సదుపాయాల గురించి అందరికి తెలిసిందే. వేరే స్టేట్స్ రైల్వేలలో ఉండే సదుపాయాల గురించి కంటే మన భారతీయ రైల్వేలలో ఉండే సదుపాయాల చాలా తక్కువ. రైళ్లలో దొరికే ఫుడ్ విషయం పక్కన పెడితే, మరుగుదొడ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. దూర ప్రాంతాలకి వెళ్లేవారు తప్పక ఆ మరుగుదొడ్లని వాడుతుంటారు. కొన్ని కొన్ని రైళ్ల పరిస్థితి బాగానే ఉన్నా, కొన్ని రైళ్లలో ఇలానే ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఒక ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ముంబై నుంచి భగత్ కి కోఠికి రైల్లో ప్రయాణించాడు. మార్గ మధ్యలో తప్పనిసరి పరిస్థితిలో వాష్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడే ఉన్న డస్ట్ బిన్ కింద ఉన్న దానిని చూసి ఆశ్చర్యపోయాడు. తీరా ఏమిటా అని చూస్తే అక్కడొక పవర్ బ్యాంకు, దానికి ఉన్న ఓ చిన్న కెమెరా. వెంటనే దానిని తీసుకుని రైల్వే పోసులకి సమాచారం అందించాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, అదే రైల్లో స్వీపర్ పని చేస్తున్న షేక్ జహిద్దీన్ అనే వ్యక్తి నిర్వాకమని తెలిసి అందరు షాక్ తిన్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అసలు ఇదంతా ఎన్ని రోజులుగా జరుగుతుంది… ఇప్పటి వరకు ఉన్న డేటా ఎక్కడైనా దాచాడా అనేదానిపై పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు.
ఇలాంటివి తరుచూ జరుగుతూనే ఉన్నాయి. హోటల్స్లో, షాపింగ్ మాల్స్ వంటి చోట కూడా ఇలాంటివి వింటూనే ఉన్నాం. ఇక ట్రైయిన్స్ లో కూడా అంటే.. మానవజాతి ఎంత నీచంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా.. మరీ ముఖ్యంగా.. ఇలాంటి సందర్భాల్లో కాస్త చుట్టు పక్కల ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. టెక్నాలజీ పెరుగుతుంది అంటే.. సంతోషించాలో.. బాధపడాలో అనే సందిగ్థ పరిస్థితిని ఇలాంటి సంఘటను కలుగుజేస్తున్నాయి.